reported By| kura Yadaiah|October 22,2025,
హిందు 9న్యూస్ తాండూర్ :
Mudiraj bhavan: తాండూరులో ఈనెల 24న ముదిరాజ్ భవన్ నిర్మాణానికై స్థలానికి శంకుస్థాపన minister v, Srihari చేతుల మీదుగా చేయనున్నట్లు, కోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు.
తాండూర్: Mudiraj bhavan| ఈనెల 24న తాండూర్ కు పశుసంవర్ధక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రానున్నారని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు.
స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
ఈ సందర్భంగా తాండూర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న బైపాస్ రోడ్డు పక్కన గల ముదిరాజ్ భవన నిర్మాణానికి minister walkitty Srihari చేత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని దాంట్లో భాగంగానే బుధవారం రోజు స్థానిక నాయకులతో కలిసి ముద్దిరాజ్ భవన నిర్మాణ సంస్థలాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. అలాగే కోటపల్లి ప్రాజెక్టు నందు చేప పిల్లల ను వదులుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో లొంక నర్సింలు శోభారాణి మైపాల్ రెడ్డి ఉత్తమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
