
దారా సింగ్ దంపతులచే రేపే పెద్దేముల్ తాండలో వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారసింగ్ తెలిపారు…..
Dara Singh|పెద్దేముల్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం పెద్దేముల్ తాండలో పిసిసి ప్రధాన కార్యదర్శి దారసింగ్, దంపతుల చేతుల మీదుగా శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధారాసింగ్ తెలిపారు.
ఆగస్ట్ 14, 15 ,తారీకులలో ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు అశేష ప్రజానీకం పాల్గొని భగవంతుని ఆశీర్వాదములు పొందాలని ధారా సింగ్ ఆకాంక్షించారు.
*పూజా కార్యక్రమం వివరాలు
14, ఆగస్టు గురువారం రోజు కార్యక్రమ వివరాలు,
14, తారీఖు గురువారం రోజు న, స్వస్తి వాచకము గణపతి పూజ పుణ్య అహవాచనం ఋత్తి గర్వనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనం, మాతృకా పూజ ,నాందీ, ఇడావాచనం, అంకురారోపణం, సర్వతోభద్ర మండలం దేవతా స్థాపనం ,వాస్తు పీఠ స్థాపనం ,నవగ్రహ మండల దేవస్థానం ,మంటప సంస్కారణ ,అగ్న్యతారణ, ప్రతిమా శోధనం, నేత్రో న్మీలనం ,ప్రసాద సంస్కారం, శిల్ప గృహత్, విగ్రహ నయనం, జలాధివాసం, అగ్ని ప్రతిస్థాపం, ఆవివాహిత దేవతా హోమము ,ధ్యానాధివాసం,
*15 తారీకు శుక్రవారం రోజున,
శయాధివాస, గర్త సంస్కార, కూర్మ శిలా పిండికా సంస్కారం ,న్యాస యంత్రస్థాపన, మూర్తి ప్రతిష్ట కళ్యానాస ,గుఢ జీరక ,దృగ్బలి, ఉన్మీలం, ప్రతిష్టంగా హోమము ,బలి ప్రధానం ,పూర్ణాహుతి, ప్రతిష్టంగా మూర్తి పూజ, విసర్జన ఆశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. కావున అధిక సంఖ్యలో భక్తజనం పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందగలరని ధార సింగ్ అశేష భక్త జనానికి ధారసింగ్ ఆహ్వానం పలికారు.
