by Kura Yadaiah| October 24,2025,
హిందు 9న్యూస్ వెబ్ డెస్క్ :
Fisheries| కోటపల్లి చెరువులో 5, లక్షల చేప పిల్లలను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వదిలారు….
Fisheries| మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పెంపకం లో భాగంగా వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టులు శుక్రవారం రోజు మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పిసరిస్ చైర్మన్ మస్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి లతో కలిసి ఐదు లక్షల చేప పిల్లలను చెరువులో వదిలారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలతోపాటు పిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య ఇతరులు తదితరులు పాల్గొన్నారు.
